జమ్మికుంటలో నీటి ఎద్దడికి నోచాన్స్..!

ఎండలపై ముందస్తు యుద్ధం ప్రకటించిన చైర్మన్

జమ్మికుంటలో నీటి ఎద్దడికి నోచాన్స్..!

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
 
ఎండాకాలం ముదురుతున్న వేళ జమ్మికుంట పట్టణ ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్. మిషన్ భగీరథ డీఈతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పట్టణంలో నీటి సరఫరా పరిస్థితులను సమగ్రంగా సమీక్షించారు.
“ప్రజలకు ఒక్క చుక్క నీరు కూడా కొరత లేకుండా సరఫరా చేయడం మన బాధ్యత” అని చైర్మన్ స్పష్టం చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులో నీటి సరఫరా నిరంతరంగా కొనసాగాలని, ఎక్కడైనా అంతరాయం కలిగితే వెంటనే పరిష్కరించాలని అధికారులను కఠినంగా ఆదేశించారు.
పైప్‌లైన్ లీకేజీలు, మోటార్ లోపాలు, నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యలను నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యమని, అందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, మిషన్ భగీరథ ఏఈ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు. బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు.
    అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు
హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌పై రాజకీయ తుపాన్ .
పదవ తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విజయకేతనం.
సీఆర్‌పీలకు బదిలీలు చేపట్టాలి.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయినా...ధాన్యం కొనుగోలు నత్తనడక .