సేంద్రియ సాగుతో భూమికి శక్తి రైతుల భవిష్యత్తుకు భరోసా.
గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్.
Views: 2
On
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త ఆశలను నింపింది. గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు యూరియా వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా భూమి సారం పెరుగుతుందని, దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకమని చెప్పారు. భూసార పరీక్షల ద్వారా భూమి నాణ్యతను తెలుసుకుని, తగిన పద్ధతులు పాటిస్తే దిగుబడులు మెరుగవుతాయని సూచించారు.
సర్పంచ్ గొలిపెల్లి సంపత్ మాట్లాడుతూ “వ్యవసాయం బలపడితేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. రైతులు సహజ పద్ధతులు, పంటల మార్పిడి, నీటి సంరక్షణ వంటి విధానాలను పాటిస్తే ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది” అని తెలిపారు. గ్రామంలో రైతులకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సేంద్రియ సాగును ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు శాస్త్రవేత్తలు సూచించిన మార్గాలను అనుసరిస్తామని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తామని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 18:59:14
మంచిర్యాల. మే 05(తెలంగాణ ముచ్చట్లు)
రానున్న బక్రీద్పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని మంచిర్యాల జోన్ పరిధిలో ప్రత్యేక చర్యలు...


Comments