అకాల వర్షం దెబ్బకు రైతన్నకు దెబ్బ – కళ్లముందే పంట నీటిపాలు.
Views: 5
On
హుజురాబాద్ మే 5(తెలంగాణ ముచ్చట్లు ):
మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షం రైతన్నలను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ గ్రామాల్లో కోత కోసి కళ్లల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన వేళ కళ్లముందే నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకస్మికంగా కురిసిన వర్షంతో ధాన్యాన్ని కాపాడుకునే అవకాశమే లేకపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యం నాణ్యత తగ్గిపోవడంతో మార్కెట్లో ధరలు కూడా తగ్గే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 22:32:34
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...


Comments