అకాల వర్షం దెబ్బకు రైతన్నకు దెబ్బ – కళ్లముందే పంట నీటిపాలు.

అకాల వర్షం దెబ్బకు రైతన్నకు దెబ్బ – కళ్లముందే పంట నీటిపాలు.

హుజురాబాద్ మే 5(తెలంగాణ ముచ్చట్లు ):
 
మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షం రైతన్నలను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ గ్రామాల్లో కోత కోసి కళ్లల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన వేళ కళ్లముందే నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకస్మికంగా కురిసిన వర్షంతో ధాన్యాన్ని కాపాడుకునే అవకాశమే లేకపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యం నాణ్యత తగ్గిపోవడంతో మార్కెట్‌లో ధరలు కూడా తగ్గే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.IMG-20260505-WA0135
ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంటలో శానిటేషన్ పనులపై చైర్మన్ క్షేత్ర స్థాయి పరిశీలన. జమ్మికుంటలో శానిటేషన్ పనులపై చైర్మన్ క్షేత్ర స్థాయి పరిశీలన.
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):   జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...
షార్ట్ సర్క్యూట్ ఘటనపై చురుకైన స్పందన – రైతులకు అండ
జమ్మికుంట సహకార సంఘంలో కీలక మార్పు.
వేసవి కాలంలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు.....
బక్రీద్ పండుగను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలి.
ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
అర్హతే ప్రామాణికం.. మూడు నెలల్లో పరిష్కారం!