జగత్పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్ను పరామర్శించిన డా. జిల్లెల ఆదిత్యరెడ్డి.
Views: 2
On
పెద్దమందడి,మే7(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్లోని అపోలో డిఆర్డిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దమందడి మండలం జగత్పల్లి గ్రామ సర్పంచ్, మాజీ పెద్దమందడి మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్ను ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షుడు డా. జిల్లెల ఆదిత్యరెడ్డి గురువారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన పెంటన్న యాదవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడిన డా. ఆదిత్యరెడ్డి, పెంటన్న యాదవ్కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. పెంటన్న యాదవ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 May 2026 17:26:57
హుస్నాబాద్. మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
హుస్నాబాద్ మండలం మాలపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను...


Comments