కోతుల బెడదకు చెక్.. హుజూరాబాద్ ప్రజలకు ఊరట.

కోతుల బెడదకు చెక్.. హుజూరాబాద్ ప్రజలకు ఊరట.

హుజురాబాద్ మే 7(తెలంగాణ ముచ్చట్లు ):
 
హుజూరాబాద్ ప్రజలను ఏళ్ల తరబడి బెంబేలెత్తిస్తున్న కోతుల బెడదకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం మేరకు గురువారం కోతుల తరలింపు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ప్రారంభించారు.
2026-27 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.4 లక్షలు కేటాయించిన మున్సిపాలిటీ, పట్టణంలోని 30 వార్డుల్లో కోతులను పట్టించే చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు ప్రారంభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోతులు ఇళ్లపైకి ఎక్కడం, ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడం, చిన్నారులు మరియు వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయంతో పట్టణ ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లైంది.
Tags:

Post Your Comments

Comments

Latest News

జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె. జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె.
హుస్నాబాద్. మే 08 (తెలంగాణ ముచ్చట్లు):   హుస్నాబాద్ మండలం మాలపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను...
తిరిగి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సింగిల్ విండో పాలకమండలి.
పెద్దమందడి సింగిల్ విండో నూతన సీఈఓ సుధాకర్‌కు ఘన సన్మానం.
జగత్‌పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్‌ను పరామర్శించిన డా. జిల్లెల ఆదిత్యరెడ్డి.
“ప్రజాస్వామ్యాన్ని దాడులతో అణిచేయలేరు”… కాంగ్రెస్ నేత ఆర్‌ఎస్ గౌడ్ ఫైర్.
కోతుల బెడదకు చెక్.. హుజూరాబాద్ ప్రజలకు ఊరట.
పేదరికాన్ని జయించి 'డాక్టర్‌' అయిన చైతన్య సాయి.