కోతుల బెడదకు చెక్.. హుజూరాబాద్ ప్రజలకు ఊరట.
Views: 2
On
హుజురాబాద్ మే 7(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ ప్రజలను ఏళ్ల తరబడి బెంబేలెత్తిస్తున్న కోతుల బెడదకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం మేరకు గురువారం కోతుల తరలింపు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని ప్రారంభించారు.
2026-27 బడ్జెట్లో ఇందుకోసం రూ.4 లక్షలు కేటాయించిన మున్సిపాలిటీ, పట్టణంలోని 30 వార్డుల్లో కోతులను పట్టించే చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు ప్రారంభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోతులు ఇళ్లపైకి ఎక్కడం, ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడం, చిన్నారులు మరియు వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయంతో పట్టణ ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లైంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 May 2026 17:26:57
హుస్నాబాద్. మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
హుస్నాబాద్ మండలం మాలపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను...


Comments