డిమాండ్ల సాధనకు వీఓఏల సమ్మె బాట.

డిమాండ్ల సాధనకు వీఓఏల సమ్మె బాట.

- ఎమ్మెల్యే మట్టా రాగమయికి వినతిపత్రం.
- ఐదు మండలాల వీఓఏల డిమాండ్.
 
సత్తుపల్లి, మే 9(తెలంగాణ ముచ్చట్లు):
 
తెలంగాణ రాష్ట్రంలోని వీఓఏల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణ ఐకేపీ వీఓఏ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఐదు మండలాలకు చెందిన వీఓఏలు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా కమల్ పాషాకు  క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఐకేపీ వీఓఏ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. వీఓఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఓఏలకు పదోన్నతులు కల్పించడంతో పాటు రూ.20 లక్షల ఆరోగ్య, సాధారణ భీమా సౌకర్యం అందించాలని కోరారు. విధుల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని, జీఓ నంబర్ 58ను సవరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని వీఓఏ నాయకులు కోరారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

డిమాండ్ల సాధనకు వీఓఏల సమ్మె బాట. డిమాండ్ల సాధనకు వీఓఏల సమ్మె బాట.
- ఎమ్మెల్యే మట్టా రాగమయికి వినతిపత్రం. - ఐదు మండలాల వీఓఏల డిమాండ్.   సత్తుపల్లి, మే 9(తెలంగాణ ముచ్చట్లు):   తెలంగాణ రాష్ట్రంలోని వీఓఏల సమస్యల పరిష్కారం కోరుతూ...
ఉపాధి హామీ పనిలో విషాదం.. గుండెపోటుతో కూలీ మృతి.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి.
చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం.
రాజకీయ పురిటి గడ్డపై తుమ్మల 40 వసంతాల వేడుకలు.
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదాతలకు సన్మానం.
రోడ్లపై పంటలు ఆరబెట్టడమే ఇద్దరి మృతికి కారణమా..?