అతివేగం ప్రమాదానికి కారణమా..?

అతివేగం ప్రమాదానికి కారణమా..?

జమ్మికుంట టౌన్ మే 09 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట మండలం రామన్నపల్లి సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. జమ్మికుంట నుంచి ఇల్లంతకుంట వైపు అతివేగంగా వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే వాహనం పూర్తిగా దెబ్బతినడంతో పాటు విద్యుత్ స్తంభం ధ్వంసమై ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags:

Post Your Comments

Comments

Latest News