ఏకగ్రీవంగా కోరపల్లి మత్స్యకారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక.
Views: 10
On
జమ్మికుంట టౌన్ మే 10 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగి ఏకగ్రీవంగా ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు సమన్వయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
సంఘం అధ్యక్షునిగా పింగిలి రమేష్ (స్వామి కుమారుడు), ఉపాధ్యక్షునిగా టంగుటూరి రామ్మోహన్, కార్యదర్శిగా మద్దెర్ల రమేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. డైరెక్టర్లుగా కొండవేనా పోషాలు, టంగుటూరి సంజీవ్, పింగిలి సంపత్, టంగుటూరి ఉమేష్, తీగల మల్లేష్, టంగుటూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ఎన్నికల ప్రక్రియను జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీమతి అరుణ జ్యోతి ఎన్నికల అధికారిగా పర్యవేక్షించివిజయవంతంగా నిర్వహించారు.
గ్రామ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. ఎన్నికైన సభ్యులకు గ్రామ ప్రజలు, మత్స్యకార సంఘ సభ్యులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.
గ్రామ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. ఎన్నికైన సభ్యులకు గ్రామ ప్రజలు, మత్స్యకార సంఘ సభ్యులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments