పరేడ్ గ్రౌండ్ వైపు కదిలిన కమల దళం.
Views: 1
On
ఎల్కతుర్తి, మే 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం లోని కార్యకర్తలు, ప్రజలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కమల దళం ఉత్సాహంగా వాహనాల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు బయలుదేరింది. పార్టీ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధాని మోడీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినేందుకు యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కార్యకర్తలు సభకు చేరుకోగా, సభ విజయవంతం కావాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ముఖ్య నాయకులు, యువమోర్చా ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
10 May 2026 20:58:38
హుజురాబాద్, మే 10(తెలంగాణ ముచ్చట్లు ):
కాలం పరుగులు తీసినా… జీవితాలు ఎన్నో మలుపులు తిరిగినా… పాఠశాల రోజుల స్నేహం మాత్రం ఎప్పటికీ చెదరదనే విషయాన్ని హుజురాబాద్...


Comments