జుపాకలో జయశంకర్ బడిబాట సందడి.. ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రుల ఆకర్షణకు ప్రత్యేక ర్యాలీ.
Views: 3
On
హుజురాబాద్, మే 14(తెలంగాణ ముచ్చట్లు ):
విద్యా వారోత్సవాల సందర్భంగా జుపాక గ్రామంలో గురువారం నిర్వహించిన “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర స్వామి నాయకత్వంలో గ్రామ వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని “ప్రభుత్వ బడి – మన బడి”, “నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం” వంటి నినాదాలతో గ్రామస్తులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు ఆధునిక బోధనా విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య వంటి సౌకర్యాలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందుతున్నదని పేర్కొంటూ, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 May 2026 22:06:48
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు*
హుజురాబాద్, మే 15(తెలంగాణ ముచ్చట్లు ):
రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...


Comments