ప్రజలకు మరింత చేరువగా మున్సిపల్ చైర్మన్.
Views: 4
On
జమ్మికుంట టౌన్ మే 12 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు గాను స్థానిక 23వ వార్డు పాత మార్కెట్ సమీపంలోని పద్మశాలి భవనం పక్కన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నూతన కార్యాలయ ప్రారంభ మహోత్సవం రేపు అనగా మే 13వ తేదీ ఉదయం 9:51 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యాలయాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రజలు, వార్డు ప్రజలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
12 May 2026 21:51:43
*సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్*
*మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దంటూ హెచ్చరిక*
*ప్రజల భద్రతే మా బాధ్యత*
మంచిర్యాల,మే12 (తెలంగాణ ముచ్చట్లు)
మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలో...


Comments