డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం : సొల్లు బాబు

డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం : సొల్లు బాబు

హుజురాబాద్,మే (తెలంగాణ ముచ్చట్లు ):

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు విమర్శించారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని ప్రజలకు హామీలు ఇచ్చారని, ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
లీటర్‌కు పెట్రోల్‌పై రూ.3.40, డీజిల్‌పై రూ.3.27 పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఇంధన ధరల పెంపుతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తూ పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సొల్లు బాబు హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక.
ఖమ్మం బ్యూరో, మే 16(తెలంగాణ ముచ్చట్లు ) మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు సంఘం జిల్లా...
విధుల్లో కఠినత్వం.. క్రీడల్లో స్వర్ణ విజయం : ఏసిపి మాధవి
రెండు వారాలు గడిచినా ధాన్యం డబ్బులు లేవు… ఐకేపీ సెంటర్ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.
పల్లెకు వెళ్లొస్తా” అన్న భద్రయ్య.. మృతదేహంగా తిరిగొచ్చాడు.
బైక్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.. ఆలస్యంగా ఫిర్యాదు.
సలీం సేవలను కాంగ్రెస్ ఎప్పటికీ మరవదు : తాజుద్దీన్
డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం : సొల్లు బాబు