మందలపల్లి కేసీఆర్ కాలనీలో త్రాగునీటి కష్టాలు.
వారం రోజులుగా నీటి కోసం అవస్థలు పడుతున్న కాలనీ వాసులు.
దమ్మపేట, మే 17(తెలంగాణ ముచ్చట్లు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గత వారం రోజులుగా పంచాయతీ నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగడానికి, నిత్యావసరాల కోసం నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కాలనీ ప్రజల సమస్య తెలుసుకున్న ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకుడు తంబళ్ల రవితో కలిసి రాత్రి సమయంలో కాలనీకి చేరుకుని ప్రజలకు త్రాగునీరు అందించారు. దీంతో కాలనీ వాసులు కొంత ఊరట చెందారు. వారం రోజులుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత నీటి సదుపాయం కల్పించాలని, లేకపోతే బిందెలతో రోడ్డెక్కి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.


Comments