తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.
తాలు–తరుగు దోపిడీ ఆపకపోతే ఆందోళనలు
-- టీఆర్పీ నేత జి. రవికుమార్ టిఆర్పి జిల్లా యూత్ అధ్యక్షులు
వనపర్తి,మే17(తెలంగాణ ముచ్చట్లు):
అకాల వర్షాలతో తడిసిపోయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు బోనస్ చెల్లించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులపై జరుగుతున్న తాలు–తరుగు దోపిడీ, అక్రమ కోతలు, అవినీతిని తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు.వనపర్తి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాణ్యత పేరుతో తడిసిన ధాన్యాన్ని తిరస్కరించడం రైతు కష్టాన్ని అవమానపరచడమేనన్నారు.కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, గోనె సంచులు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.క్వింటాల్కు కోతలు విధించడం బహిరంగ దోపిడీ అని ఆరోపించిన ఆయన, ప్రత్యేక మార్గదర్శకాలతో ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


Comments