తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.

తాలు–తరుగు దోపిడీ ఆపకపోతే ఆందోళనలు

-- టీఆర్పీ నేత జి. రవికుమార్ టిఆర్పి జిల్లా యూత్ అధ్యక్షులు 
 
వనపర్తి,మే17(తెలంగాణ ముచ్చట్లు):

అకాల వర్షాలతో తడిసిపోయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు బోనస్ చెల్లించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులపై జరుగుతున్న తాలు–తరుగు దోపిడీ, అక్రమ కోతలు, అవినీతిని తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు.వనపర్తి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాణ్యత పేరుతో తడిసిన ధాన్యాన్ని తిరస్కరించడం రైతు కష్టాన్ని అవమానపరచడమేనన్నారు.కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, గోనె సంచులు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.క్వింటాల్‌కు కోతలు విధించడం బహిరంగ దోపిడీ అని ఆరోపించిన ఆయన, ప్రత్యేక మార్గదర్శకాలతో ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ.
వనపర్తి,మే17(తెలంగాణ ముచ్చట్లు):  పేదల ఆరోగ్య రక్షణలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.ఆదివారం...
పెట్రోల్, డీజిల్ ధరల భారం మోయలేక ప్రజలు విలవిల.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.
ఎస్సీ వర్గీకరణ అవకాశాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
మందలపల్లి కేసీఆర్ కాలనీలో త్రాగునీటి కష్టాలు.
ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఈనెల 20న దేశవ్యాప్త బంద్.
జూపాకలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహణ.