పెట్రోల్, డీజిల్ ధరల భారం మోయలేక ప్రజలు విలవిల.

పెట్రోల్, డీజిల్ ధరల భారం మోయలేక ప్రజలు విలవిల.

పెంచిన ధరలను వెంటనే  తగ్గించాలి 

-- మల్లక్ సురేష్ వెల్టూర్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు 

పెద్దమందడి,మే17(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మల్లక్ సురేష్ కేంద్ర ప్రభుత్వంపై ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు.ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ప్రతి రంగంపైనా పడుతోందని, రైతుల నుంచి ఆటో డ్రైవర్లు, కార్మికుల నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరూ ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమై, దాని ప్రభావం నేరుగా ప్రజల జీవన వ్యయంపై పడుతోందని తెలిపారు.ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ధరల పెంపుతో ముందుకు సాగడం బాధాకరమని మల్లక్ సురేష్ విమర్శించారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలకు ఊరటనివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ.
వనపర్తి,మే17(తెలంగాణ ముచ్చట్లు):  పేదల ఆరోగ్య రక్షణలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.ఆదివారం...
పెట్రోల్, డీజిల్ ధరల భారం మోయలేక ప్రజలు విలవిల.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.
ఎస్సీ వర్గీకరణ అవకాశాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
మందలపల్లి కేసీఆర్ కాలనీలో త్రాగునీటి కష్టాలు.
ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఈనెల 20న దేశవ్యాప్త బంద్.
జూపాకలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహణ.