జర్నలిస్టులు ప్రజల సమస్యలకు వారధిగా నిలవాలి: ప్రణవ్ బాబు.
Views: 3
On
హుజురాబాద్, మే 19(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్లో మంగళవారం ప్రెస్ క్లబ్ మీడియా ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి జర్నలిస్టులు వారధిగా పనిచేయాలని ఆయన కోరారు. సమాజ అభివృద్ధిలో మీడియా పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జర్నలిస్టు సుదర్శన్ కుటుంబానికి ప్రమాద బీమా పోస్టల్ బాండ్ను ప్రణవ్ బాబు అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, పలువురు జర్నలిస్టులు, విలేకరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 May 2026 21:34:33
పెద్దమందడి,మే19(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల ఉమ్మడి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్గా నూతనంగా నియమితులైన కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా...


Comments