కిష్టారం ఓసీలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం.!

సింగరేణి అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలి.

కిష్టారం ఓసీలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం.!

సత్తుపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): 

సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తూ నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచాలని సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాసరావు అన్నారు.IMG-20260520-WA0052సత్తుపల్లి ఏరియాకు చెందిన కిష్టారం ఓసీలో బుధవారం నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి, రెండో షిఫ్ట్‌లలో జరిగిన ఈ సమావేశాల్లో ఉద్యోగులకు సంస్థ లక్ష్యాలు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆదేశాల మేరకు అన్ని ఏరియాల్లో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులంతా రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ సమైక్య భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కిష్టారం ఓసీ నిర్దేశిత లక్ష్యాలను సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. “మన సంస్థ–మన గని–మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిజిఎం(ఐఈ) ఎన్. యోహాన్ మాట్లాడుతూ సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత, యంత్రాల పనితీరు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏఎల్ఎస్‌వీ సునీల్ వర్మ, ఎస్ఓ టు జీఎం బి. శ్రీనివాసు, ఎజిఎం(ఎఫ్&ఏ) ఈ. బీబత్స, ప్రాజెక్ట్ ఇంజనీర్ జి. వెంకటేశ్వరరావు, డిప్యూటీ పీఎం జి. హరీష్, ఎస్‌వోఎం బి. రామకృష్ణ, అడిషనల్ మేనేజర్ వల్లమల్ల బాబు, రక్షణాధికారి గోపి కిషోర్, వెల్ఫేర్ ఆఫీసర్ (ఇన్‌చార్జి) కె. శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ పిట్ సెక్రటరీ బాలాజీ, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ కిషోర్ కుమార్‌తో పాటు అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు
భీమదేవరపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా...
మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.
ప్రజల భద్రత కోసం కెమిస్టుల బంద్.. జమ్మికుంటలో ఐక్య నిరసన.
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
దేవాదాయ శాఖ నిర్ణయానికి అర్చకుల కృతజ్ఞతలు.