ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా సభ గోడపత్రిక ఆవిష్కరణ

ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా సభ గోడపత్రిక ఆవిష్కరణ

పెద్దమందడి,మే20(తెలంగాణ ముచ్చట్లు):

సామాజిక న్యాయం – రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా.. అనే నినాదంతో ఈ నెల 31న వనపర్తి జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికను పెద్దమందడి మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి మండల కన్వీనర్ ఆర్. ఈశ్వర్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే ధ్యేయంగా ధర్మ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతుతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో (ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాంగణం) ఈ బహిరంగ సభ జరగనున్నట్లు చెప్పారు.బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కమిటీ సభ్యుడు మధు మహారాజ్‌తో పాటు ఈశ్వర్, శాంతన్న, భగవంతు, మధుసూదన్, జీవన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు
భీమదేవరపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా...
మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.
ప్రజల భద్రత కోసం కెమిస్టుల బంద్.. జమ్మికుంటలో ఐక్య నిరసన.
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
దేవాదాయ శాఖ నిర్ణయానికి అర్చకుల కృతజ్ఞతలు.