కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం

కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం

జమ్మికుంట టౌన్ మే 20 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండల పరిధిలో పోలీసులు చేపట్టిన భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో హుజూరాబాద్ రూరల్ ఇన్‌స్పెక్టర్, సైదాపూర్ ఎస్ఐతో పాటు ఎస్ఐలు యూన్స్, రవి తమ సిబ్బందితో కలిసి విలాసాగర్, తనుగుల, గండ్రపల్లి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

గ్రామాల సరిహద్దులను దిగ్బంధించి ప్రతి ఇంటిని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు, ఆధారాలు లేని ఎనిమిది మోటార్‌సైకిళ్లు, రెండు ఖాళీ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి రికార్డులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసమే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు వెంట ఉంచుకోవాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు
భీమదేవరపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా...
మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.
ప్రజల భద్రత కోసం కెమిస్టుల బంద్.. జమ్మికుంటలో ఐక్య నిరసన.
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
దేవాదాయ శాఖ నిర్ణయానికి అర్చకుల కృతజ్ఞతలు.