బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
జమ్మికుంట టౌన్ మే 20 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కిషోర బాలికల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రారంభించారు. మెప్మా, వావిలాల ప్రాథమిక వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో వైద్యురాలు చందన కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు హిమోగ్లోబిన్, షుగర్ తదితర వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే బాలికలకు ఆరోగ్య సంబంధిత సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రవణ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ మొలుగు చందన, హెల్త్ సూపర్వైజర్ అరుణ, కొండపాక సదానందం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎం రాధ, మెప్మా సిఎల్ఆర్పీలు జ్యోతి తదితరులు, ఆశా వర్కర్లు మరియు పలువురు కిషోర బాలికలు పాల్గొన్నారు.


Comments