బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం

జమ్మికుంట టౌన్ మే 20 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కిషోర బాలికల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రారంభించారు. మెప్మా, వావిలాల ప్రాథమిక వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో వైద్యురాలు చందన కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు హిమోగ్లోబిన్, షుగర్ తదితర వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే బాలికలకు ఆరోగ్య సంబంధిత సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ మొలుగు చందన, హెల్త్ సూపర్వైజర్ అరుణ, కొండపాక సదానందం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్‌ఎం రాధ, మెప్మా సిఎల్‌ఆర్పీలు జ్యోతి తదితరులు, ఆశా వర్కర్లు మరియు పలువురు కిషోర బాలికలు పాల్గొన్నారు.IMG-20260520-WA0072

Tags:

Post Your Comments

Comments

Latest News

కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు
భీమదేవరపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా...
మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.
ప్రజల భద్రత కోసం కెమిస్టుల బంద్.. జమ్మికుంటలో ఐక్య నిరసన.
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
దేవాదాయ శాఖ నిర్ణయానికి అర్చకుల కృతజ్ఞతలు.