హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి.
మున్సిపల్ కమిషనర్ బి. కిషన్కు బీసీ ఆజాది ఫెడరేషన్ శుభాకాంక్షలు.
హుజూరాబాద్, మే 20(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన బి. కిషన్ను బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హుజూరాబాద్ను తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని వారు ఆకాంక్షించారు.
అభివృద్ధి, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు, ప్రజా సేవలు తదితర అన్ని రంగాల్లో హుజూరాబాద్ను ఆదర్శంగా నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, మండల ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్, కూడికల ప్రభాకర్, ఎం.డి. బాబర్, పోతారపు అశోక్, ఆళ్ల కేశ తదితరులు పాల్గొన్నారు.


Comments