యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న బెల్ట్ షాపులు: కాంగ్రెస్ నాయకుడు మ్యాక వంశీ
Views: 44
On
భీమదేవరపల్లి, మే27(తెలంగాణ ముచ్చట్లు)
భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామంలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని గ్రామ కాంగ్రెస్ నాయకుడు మ్యాక వంశీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా, స్థానికంగా రాత్రి 9 గంటలకే మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించడం వల్ల గ్రామ యువత మద్యం బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపులను మూసివేసి యువతను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
28 May 2026 22:20:02
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...


Comments