కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.

కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.

భీమదేవరపల్లి:మే30(తెలంగాణ ముచ్చట్లు)

కోర్టు వాయిదాలకు సకాలంలో హాజరుకాని నలుగురు వ్యక్తులను న్యాయమూర్తి ఆదేశాల మేరకు హుజూరాబాద్ జైలుకు తరలించినట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వేల్పుల రవీందర్, వేల్పుల వెంకటేష్, చల్లూరి భాస్కర్‌తో పాటు కొప్పూరు గ్రామానికి చెందిన గద్ద రామరాజు తమపై నమోదైన కేసుల విచారణకు సంబంధించి కోర్టు వాయిదాలకు పదేపదే గైర్హాజరవుతున్నట్లు వెల్లడైంది.
కోర్టు విచారణకు ఉద్దేశపూర్వకంగా హాజరుకావడం లేదని గుర్తించిన న్యాయమూర్తి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు సదరు నలుగురిని అదుపులోకి తీసుకుని హుజూరాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .