విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం.

విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం.

వేలేరు, మే 30 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో అంబేద్కర్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బొల్లం రాజు నాయకత్వంలో పదో తరగతి విద్యార్థులకు నెల రోజులపాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బిల్లా యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు.అనంతరం సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ, విద్యార్థులు విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, క్రమశిక్షణతో చదివి జీవితంలో విజయాలను సాధించాలని సూచించారు. మొత్తం 50 మంది పదో తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ అందించబడిందన్నారు.ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ శ్రీకర్ పాల్గొన్నారు. అలాగే శిక్షణ తరగతుల నిర్వహణ కోసం హాల్ భవనాన్ని అందించిIMG-20260530-WA0071న రవిని నిర్వాహకులు అభినందించారు.కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .