పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేనా..?

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేనా..?

భీమదేవరపల్లి, మే 21 (తెలంగాణ ముచ్చట్లు)

పేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తొలి విడతలో కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రక్రియ ప్రారంభించగా, మిగిలిన అర్హులు రెండవ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, అర్హత ప్రమాణాల ఆధారంగా కొత్త జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భూమిలేని పేదలు, పాత ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు, తొలి విడతలో అవకాశం దక్కని అర్హులకు రెండవ విడతలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా భీమదేవరపల్లి మండలం ములకనూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన కారణంగానే తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండవ విడతలో అయినా తమకు ఇల్లు మంజూరు అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

అయితే రెండవ విడత లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అర్హులలో ఉత్కంఠ నెలకొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైతుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఎల్కతుర్తి, మే 21 (తెలంగాణ ముచ్చట్లు); ఎల్కతుర్తి మండలంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తీవ్ర ఆగ్రహం...
ధరణి తిప్పలకు చెక్‌.!
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేనా..?
కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు
మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.
ప్రజల భద్రత కోసం కెమిస్టుల బంద్.. జమ్మికుంటలో ఐక్య నిరసన.
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం