ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్.
ఖమ్మం బ్యూరో, మే 30(తెలంగాణ ముచ్చట్లు )
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలందించారారని పోలీస్ కమీషనర్ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ విరమణ పొందిన వారు
బి. నాగేశ్వర్ రావు, ఎస్ ఐ ఉమెన్ పిఎస్ ,
ఎన్. ఉప్పయ్య, ఏఎస్ఐ ఖమ్మం II టౌన్
ఎం . గురునాధం, ఏఎస్ఐ ముదిగొండ
పి . ప్రకాష్ రావు, హెచ్ సి మదిర టౌన్
పి. లక్ష్మణ్ రావు (ఎస్సై కమ్యూనికేషన్)
కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ ఐ లు కామరాజు, అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Comments