సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.
ఎల్కతుర్తి, మే 22( తెలంగాణ ముచ్చట్లు):
సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త గొర్రె మహేందర్కు ప్రతిష్టాత్మక “దళిత రత్న” పురస్కారం లభించింది. 2025-26 సంవత్సరానికి గాను మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఈ అవార్డును ప్రదానం చేసింది. శుక్రవారం హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా గొర్రె మహేందర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా గొర్రె మహేందర్ మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గొర్రె మహేందర్కు శుభాకాంక్షలు తెలిపారు.


Comments