సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.

సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.

ఎల్కతుర్తి, మే 22( తెలంగాణ ముచ్చట్లు):

సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త గొర్రె మహేందర్‌కు ప్రతిష్టాత్మక “దళిత రత్న” పురస్కారం లభించింది. 2025-26 సంవత్సరానికి గాను మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఈ అవార్డును ప్రదానం చేసింది. శుక్రవారం హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా గొర్రె మహేందర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా గొర్రె మహేందర్ మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గొర్రె మహేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్.
ఎల్కతుర్తి , మే 22 (తెలంగాణ ముచ్చట్లు): ఇందిరానగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రామపంచాయతీ భవన పనులను నిర్లక్ష్యంగా కొనసాగిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టర్‌పై...
సమాజ సేవకుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.
గ్రామస్తులతో కలిసి మంటలను ఆర్పిన సర్పంచ్ సంపత్.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.
సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.
శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.