విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.

ఎల్కతుర్తి, మే 22 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పరిధిలోని దండేపల్లి గ్రామం లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో లూజుగా IMG-20260522-WA0106ఉన్న కరెంటు తీగలు ఒకదానికొకటి తగలడంతో స్పార్కులు ఏర్పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 20 ఎకరాల వరి గడ్డి కాలిపోగా, సుమారు 50 మామిడి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
బాధిత రైతు వద్దెల్లి అన్నారావు మాట్లాడుతూ గ్రామంలో చాలా చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందించలేదని ఆరోపించారు. వేసవి కాలంలో తీగల రాపిడి కారణంగా స్పార్కులు ఏర్పడి మంటలు వ్యాపిస్తున్నాయని తెలిపారు.
ఈ ప్రమాదంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్.
ఎల్కతుర్తి , మే 22 (తెలంగాణ ముచ్చట్లు): ఇందిరానగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రామపంచాయతీ భవన పనులను నిర్లక్ష్యంగా కొనసాగిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టర్‌పై...
సమాజ సేవకుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.
గ్రామస్తులతో కలిసి మంటలను ఆర్పిన సర్పంచ్ సంపత్.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.
సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.
శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.