ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.

వైద్య సేవలను మెరుగుపరచాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సూచన.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.

హుజురాబాద్, మే22(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి  ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎన్ సీడీ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ తీరును తెలుసుకున్నారు.
ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమయానికి చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష, సిబ్బంది సదానందం, ప్రతాప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్.
ఎల్కతుర్తి , మే 22 (తెలంగాణ ముచ్చట్లు): ఇందిరానగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రామపంచాయతీ భవన పనులను నిర్లక్ష్యంగా కొనసాగిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టర్‌పై...
సమాజ సేవకుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.
గ్రామస్తులతో కలిసి మంటలను ఆర్పిన సర్పంచ్ సంపత్.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.
సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.
శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.