అమ్మపల్లిలో విషాదం.. ఎద్దుల బండి ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి.

అమ్మపల్లిలో విషాదం.. ఎద్దుల బండి ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి.

పెద్దమందడి,జూన్01(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన దేసు సాత్విక్ (12) ఎద్దుల బండిపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, సాత్విక్ ఎద్దుల బండిపై ప్రయాణిస్తుండగా అదుపు తప్పి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.బాలుడి అకాల మరణంతో అమ్మపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గ్రామస్థులు సాత్విక్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం. గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం.
వేలేరు, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు): వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళా బృందం ఆదివారం రాత్రి...
భీమదేవరపల్లిలో బెల్ట్ షాపుల నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం.
గ్రామాభివృద్ధే లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ చంద్రశేఖర్ శ్రీకారం
రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు.. అనుమానితులపై పోలీసుల ప్రత్యేక నిఘా.
విద్యార్థుల సర్టిఫికెట్ల జాప్యంపై ఆందోళన.. తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం.
పొదుపు మనిషికి ఆర్థిక స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని అందిస్తుంది.
రైతుల రాకపోకలకు ఆటంకం వద్దు.. అధికారులకు మున్సిపల్ చైర్మన్ సూచన.