దేశ సేవకు అడుగులు..
ఇండియన్ ఆర్మీకి ఎంపికైన గాజు వంశీ .
భీమదేవరపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాజు వంశీ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా యువకులు వంశీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు దేశ సేవకు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొంటూ, వంశీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కాసనగొట్టు సాయిరాం, వెన్నంపల్లి నాగరాజు, గాజు ముత్యాల అరవింద్, ముత్యాల శ్రావణ్, ఒడ్డెపల్లి శ్రీనివాస్, బరిగె నరేష్, కుమార్, అయిలయ్య, పొన్న శ్రీను, బండారి కార్తీక్, గాజు చింటూ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ యువత సాధించిన ఈ విజయం ఇతర యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.


Comments