దేశ సేవకు అడుగులు.. 

ఇండియన్ ఆర్మీకి ఎంపికైన గాజు వంశీ .

దేశ సేవకు అడుగులు.. 

భీమదేవరపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాజు వంశీ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా యువకులు వంశీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు దేశ సేవకు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొంటూ, వంశీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కాసనగొట్టు సాయిరాం, వెన్నంపల్లి నాగరాజు, గాజు ముత్యాల అరవింద్, ముత్యాల శ్రావణ్, ఒడ్డెపల్లి శ్రీనివాస్, బరిగె నరేష్, కుమార్, అయిలయ్య, పొన్న శ్రీను, బండారి కార్తీక్, గాజు చింటూ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ యువత సాధించిన ఈ విజయం ఇతర యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భక్తి, సేవ, అభివృద్ధి దిశగా సూరారం గ్రామం. భక్తి, సేవ, అభివృద్ధి దిశగా సూరారం గ్రామం.
ఎల్కతుర్తి, జూన్ 4( తెలంగాణ ముచ్చట్లు): హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం భక్తి, సేవ, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. గ్రామంలో నిర్మాణంలో ఉన్న...
ప్రశ్నిస్తారనే భయంతోనే నిర్బంధాలు సీఎం పర్యటనపై నిరంజన్ రెడ్డి విమర్శలు.
రాయి పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడి మృతి.
వర్షాకాలానికి ముందస్తు చర్యలు చేపట్టాలి!
ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు.
మంగంపల్లిని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
గ్రామఅభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామసభలో చర్చ.