తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా.
వేంసూరు, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారి డా. తిమ్మిడి నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరవీరులు చేసిన త్యాగాలు, ప్రజలు సాగించిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.


Comments