సిగ్నల్ కోసం ఎదురుచూపులు.. పని లేక నిరాశలో కార్మికులు.
Views: 3
On
వేలేరు, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) పనులు సిగ్నల్ సమస్య కారణంగా తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. పనులకు హాజరయ్యే కార్మికుల ముఖ గుర్తింపు (ఫేస్ అటెండెన్స్) నమోదు కోసం మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేకపోవడంతో కార్మికులు పని ప్రదేశాల వద్ద నిరీక్షిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
సిగ్నల్ అందకపోవడంతో హాజరు నమోదు కాక పనులు ప్రారంభించలేకపోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పనులకు వచ్చినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా సమయం వృథా అవుతోందని, దీంతో ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయని వారు తెలిపారు.
గ్రామంలో మొబైల్ నెట్వర్క్ సమస్యను పరిష్కరించి, ఉపాధి హామీ పనులు సజావుగా సాగేందుకు అధికారులుతక్షణ చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. 
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Jun 2026 20:57:29
- నగదు, నిత్యావసర వస్తువుల అందజేత.- ఇందిరమ్మ గృహం మంజూరుకు చర్యలు.
సత్తుపల్లి, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలోని వెంగళరావు కాలనీలో అగ్నిప్రమాదంలో సర్వం...


Comments