ఆర్టీసీ డిపో పరిధిలో పచ్చదనానికి శ్రీకారం!

పచ్చని పరిసరాలే భావితరాలకు విలువైన ఆస్తి.

ఆర్టీసీ డిపో పరిధిలో పచ్చదనానికి శ్రీకారం!

సత్తుపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం సత్తుపల్లి డిపో ఆవరణలో మొక్కల పెంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా డిపో పరిధిలోని బస్టాండ్లలో విస్తృత స్థాయిలో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సత్తుపల్లితో పాటు అశ్వారావుపేట, కల్లూరు, వీఎం బంజర బస్టాండ్లలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కనైనా నాటి సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్‌కుమార్, ఎల్‌హెచ్ కాంతారావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు ఆనందం, జాకబ్, ఏడీసీ విజయ్‌కుమార్, డీఐ ప్రభాకర్, వీబీఓ కిన్నెర ఆనందరావు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు సైదిరెడ్డి, రాంబాబు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.IMG-20260603-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్. మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్.
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రులు  ముక్కెర గోపాల్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేత  చిల్పూర్,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామానికి చెందిన...
పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించిన సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత.
భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.
నాణ్యమైన విద్యతో ప్రభుత్వ బడులపై పెరుగుతున్న విశ్వాసం.
శ్రీకర్ మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆరోపణలు అవాస్తవం!
జమ్మికుంటలో హరీష్ రావు బర్త్‌డే సెలబ్రేషన్స్.. శివాలయంలో అన్నదానం.
చేప పిల్లల సరఫరాలో అక్రమాలపై ఆగ్రహం.