గిరిజన బాలికల వసతి గృహంలో కొండచిలువ కలకలం!

గిరిజన బాలికల వసతి గృహంలో కొండచిలువ కలకలం!

- సత్తుపల్లిలో ఘటన.
- సురక్షితంగా పట్టుకున్న రిటైర్డ్ అటవీ శాఖ అధికారి.

సత్తుపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి గిరిజన బాలికల వసతి గృహంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై విద్యార్థినులను భయాందోళనకు గురిచేసింది. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ వసతి గృహంలోకి చొరబడినట్లు తెలిసింది. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో ఎక్కువ మంది విద్యార్థినులు హాస్టల్‌లో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. బీఈడీ పరీక్షల కోసం వసతి గృహంలో ఉన్న ఇద్దరు విద్యార్థినులు కొండచిలువను గుర్తించి భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రిటైర్డ్ అటవీ శాఖ బీట్ అధికారి ఎం.డి. మమ్మూద్ ఘటనాస్థలికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటనతో కొంతసేపు వసతి గృహంలో కలకలం నెలకొనగా, కొండచిలువను సురక్షితంగా తొలగించడంతో విద్యార్థినులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్. మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్.
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రులు  ముక్కెర గోపాల్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేత  చిల్పూర్,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామానికి చెందిన...
పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించిన సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత.
భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.
నాణ్యమైన విద్యతో ప్రభుత్వ బడులపై పెరుగుతున్న విశ్వాసం.
శ్రీకర్ మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆరోపణలు అవాస్తవం!
జమ్మికుంటలో హరీష్ రావు బర్త్‌డే సెలబ్రేషన్స్.. శివాలయంలో అన్నదానం.
చేప పిల్లల సరఫరాలో అక్రమాలపై ఆగ్రహం.