బోర్నపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో దాదాపు 25 ఎకరాల వరి కొయ్యలు దగ్ధం.

బోర్నపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో దాదాపు 25 ఎకరాల వరి కొయ్యలు దగ్ధం.

బావి వద్ద విద్యుత్ వైర్లు, పైపులు కూడా కాలిపోవడంతో రైతులకు భారీ నష్టం

హుజూరాబాద్,జూన్3(తెలంగాణ ముచ్చట్లు )

మండలంలోని బోర్నపల్లి గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వరి కొయ్యలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్థానికుల సమాచారం ప్రకారం, విద్యుత్ తీగల్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి వేగంగా పొలాల్లో వ్యాపించాయి. ఎండగాలుల కారణంగా మంటలు మరింత ఉధృతమై వరి కొయ్యలను కాల్చివేశాయి. అగ్నిప్రమాదం సమయంలో వ్యవసాయ బావి వద్ద ఉన్న విద్యుత్ వైర్లు, పైపులు కూడా కాలిపోవడంతో రైతులకు అదనపు నష్టం వాటిల్లింది.
సమాచారం అందుకున్న రైతులు, గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. వారి అప్రమత్తతతో మంటలు మరింత విస్తరించకుండా నిలువరించగలిగారు.
ఈ ప్రమాదంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, సంబంధిత అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు, రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్. మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్.
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రులు  ముక్కెర గోపాల్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేత  చిల్పూర్,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామానికి చెందిన...
పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించిన సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత.
భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.
నాణ్యమైన విద్యతో ప్రభుత్వ బడులపై పెరుగుతున్న విశ్వాసం.
శ్రీకర్ మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆరోపణలు అవాస్తవం!
జమ్మికుంటలో హరీష్ రావు బర్త్‌డే సెలబ్రేషన్స్.. శివాలయంలో అన్నదానం.
చేప పిల్లల సరఫరాలో అక్రమాలపై ఆగ్రహం.