హ్యాపీ సండే కార్యక్రమంలో సందడి చేసిన మున్సిపల్ చైర్మన్ దిలీప్.

హ్యాపీ సండే కార్యక్రమంలో సందడి చేసిన మున్సిపల్ చైర్మన్ దిలీప్.

జమ్మికుంట టౌన్ జూన్ 07 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొన్నారు.

ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారంలో ఒకరోజు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేలా హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించి వ్యాయామం, క్రీడలు, శారీరక శ్రమను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం మైదానంలో పాల్గొన్న ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హాజరైన చిన్నారులతో కలిసి కొంతసేపు క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, మాచర్ల రాజు, దిడ్డి రాము, మేనేజర్ జి. రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఏఈ వికాస్, గోవింద్, కుమారస్వామి, సాయి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి. గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి.
మదనాపురం జూన్08(తెలంగాణ ముచ్చట్లు):  గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) వనపర్తి జిల్లా యూత్...
మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామికి కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.
పార్టీ బలోపేతానికి బీఎల్ఏలు వారధులుగా పనిచేయాలి.
గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది.
ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరిస్తాం.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎల్కతుర్తి పోలీసుల ఉక్కు పాదం.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.