గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి.

టీఆర్‌పీ జిల్లా యూత్ అధ్యక్షుడు రవికుమార్.

గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి.

మదనాపురం జూన్08(తెలంగాణ ముచ్చట్లు): 

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్ ఆరోపించారు.సోమవారం మదనాపురం మండలం తిర్మలాయపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.గత నెలలో నిర్వహించిన గ్రామసభలో 8వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు, పిచ్చిమొక్కల తొలగింపు, దోమల నివారణ తదితర అంశాలపై అధికారులకు వినతిపత్రం అందజేసినా ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని విమర్శించారు.మురుగునీటి నిల్వలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.గ్రామంలో ఫాగింగ్, బ్లీచింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విద్యార్థుల కోసం గ్రంథాలయం, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతురాజు రాములు, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి. గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి.
మదనాపురం జూన్08(తెలంగాణ ముచ్చట్లు):  గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) వనపర్తి జిల్లా యూత్...
మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామికి కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.
పార్టీ బలోపేతానికి బీఎల్ఏలు వారధులుగా పనిచేయాలి.
గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది.
ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరిస్తాం.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎల్కతుర్తి పోలీసుల ఉక్కు పాదం.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.