కోరపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం.

కోరపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం.

జమ్మికుంట టౌన్ జూన్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో శుక్రవారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కె. మధుసూదన్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.

సర్పంచ్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం కోసం నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, గుడ్లు, రాగిజావ, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆధునిక విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా బాలికలకు కరాటే శిక్షణ, కంప్యూటర్ విద్య, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. రాజయ్య, పెండెం శ్రీనివాస్, కుమారస్వామి, విజేందర్ రెడ్డి, క్రాఫ్ట్ ఉపాధ్యాయుడు శ్రీమాన్, సీఆర్‌పీ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులైన సబ్బని రమేష్‌కు ఘన సన్మానం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులైన సబ్బని రమేష్‌కు ఘన సన్మానం.
హుజూరాబాద్, జూన్ 12 (తెలంగాణ ముచ్చట్లు): హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు, సామాజిక కార్యకర్త సబ్బని రమేష్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్...
పట్టణ అభివృద్ధికి వ్యాపార సంస్థలే బల.
గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.
కోరపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం.
ఉద్యమ నాయకుడికి ఘన స్వాగతం.. జన్మదిన వేడుకలు నిర్వహించిన చైర్మన్ దిలీప్.
గులాబీ గర్జనతో మారుమోగిన జమ్మికుంట.. హరీశ్ సభకు పోటెత్తిన జనసందోహం.
ముల్కనూర్ ఆర్టీసీ బస్ స్టేషన్‌ను సందర్శించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.