గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.
రోడ్డును చదును చేయించిన ముల్కనూర్ ఎస్సై రాజు.
భీమదేవరపల్లి,జూన్ 12(తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు.
ఈ ప్రాంతంలో రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రం సహాయంతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి, రహదారిని పూర్తిగా చదును చేయించారు.
ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ, ప్రజల ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గోపాల్పూర్ క్రాస్ వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టామని, వాహనదారులు వేగ పరిమితులను పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.
రోడ్డును మరమ్మతు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేసిన ఎస్సై రాజు మరియు పోలీస్ సిబ్బందిని స్థానిక ప్రజలు, వాహనదారులు అభినందించారు. ఈ చర్యలతో గోపాల్పూర్ క్రాస్ వద్ద ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments