గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.

రోడ్డును చదును చేయించిన ముల్కనూర్ ఎస్సై రాజు.

గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.

భీమదేవరపల్లి,జూన్ 12(తెలంగాణ ముచ్చట్లు): 

మండల పరిధిలోని గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు.

ఈ ప్రాంతంలో రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రం సహాయంతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి, రహదారిని పూర్తిగా చదును చేయించారు.

ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ, ప్రజల ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గోపాల్‌పూర్ క్రాస్ వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టామని, వాహనదారులు వేగ పరిమితులను పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.

రోడ్డును మరమ్మతు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేసిన ఎస్సై రాజు మరియు పోలీస్ సిబ్బందిని స్థానిక ప్రజలు, వాహనదారులు అభినందించారు. ఈ చర్యలతో గోపాల్‌పూర్ క్రాస్ వద్ద ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులైన సబ్బని రమేష్‌కు ఘన సన్మానం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులైన సబ్బని రమేష్‌కు ఘన సన్మానం.
హుజూరాబాద్, జూన్ 12 (తెలంగాణ ముచ్చట్లు): హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు, సామాజిక కార్యకర్త సబ్బని రమేష్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్...
పట్టణ అభివృద్ధికి వ్యాపార సంస్థలే బల.
గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.
కోరపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం.
ఉద్యమ నాయకుడికి ఘన స్వాగతం.. జన్మదిన వేడుకలు నిర్వహించిన చైర్మన్ దిలీప్.
గులాబీ గర్జనతో మారుమోగిన జమ్మికుంట.. హరీశ్ సభకు పోటెత్తిన జనసందోహం.
ముల్కనూర్ ఆర్టీసీ బస్ స్టేషన్‌ను సందర్శించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.