సేంద్రియ వంకాయలతో వినియోగదారుల మన్ననలు పొందుతున్న రైతు.
వనపర్తి,జూన్14(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పానుగల్ మండలం ఆకునోనిపల్లి గ్రామానికి చెందిన రైతు జూటూరు స్వామి సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలను వనపర్తి మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతున్నారు. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తూ ఆరోగ్యకరమైన కూరగాయల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు.గత రెండు నెలలుగా సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలను మార్కెట్లో విక్రయిస్తున్నామని, వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని రైతు స్వామి తెలిపారు.నాణ్యమైన, ఆరోగ్యకరమైన కూరగాయలను ప్రజలకు అందుబాటు ధరలో అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.త్వరలో మరిన్ని కూరగాయలను కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేసి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా భూమి సారాన్ని కాపాడుతుందని, రైతులు ఈ విధానాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు.సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలు కొనుగోలు చేయాలనుకునే వారు రైతు జూటూరు స్వామిని 72888 11005 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.


Comments