పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.

పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.

పెద్దమందడి,జూన్14తెలంగాణ ముచ్చట్లు):

వేసవి సెలవుల అనంతరం రేపు (జూన్ 15, 2026) పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబవుతోంది.విద్యార్థులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు పాఠశాల ఆవరణలోని ప్లే గ్రౌండ్‌లో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడలకు సంబంధించిన కోర్టులను సిద్ధం చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ పనులను చేపట్టిన గ్రామ సర్పంచ్ అశోక్ ప్రత్యేక చొరవను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సర్పంచ్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.రేపు పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న గ్రామ సర్పంచ్‌కు ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల బృందం కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం. కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు...
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.
శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం.
మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.
రైతు సమస్యలపై సూరారంలో గర్జించిన రైతాంగం.
పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.
బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం.