డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు.

డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

హుజురాబాద్, జూలై 8(తెలంగాణ ముచ్చట్లు ):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా హుజురాబాద్‌లో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, రైతులు, విద్యార్థులు, పేదలు, మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతగా వైఎస్సార్‌ను కొనియాడారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి వైఎస్సార్‌కు నివాళులర్పించి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు. ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.
ఎల్కతుర్తి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు): మండల పరిధిలోని ది విశాల సహకార బ్యాంకు నూతన పాలకవర్గంలో నామినేటెడ్ సొసైటీ డైరెక్టర్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో...
నారు సిద్ధం, నీటి కోసం నిరీక్షణ వర్షాభావంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం.
కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
కాంగ్రెస్ నాయకుల యోగక్షేమాలు తెలుసుకున్న ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని.
24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.
ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి: మిల్కూరి వాసుదేవరెడ్డి.