రెండు కుటుంబాలను పరామర్శించిన మంత్రి తుమ్మల.

రెండు కుటుంబాలను పరామర్శించిన మంత్రి తుమ్మల.

- మందలపల్లిలో అడపా పుష్పావతికి నివాళులు.
- పట్వారిగూడెంలో చెలికాని రంగారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

దమ్మపేట, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం దమ్మపేట మండలంలోని మందలపల్లి, పట్వారిగూడెం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన ఇద్దరి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మందలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొర తల్లి స్వర్గీయ అడపా పుష్పావతి ఇటీవల కన్నుమూయడంతో మంత్రి తుమ్మల వారి నివాసానికి వెళ్లి పుష్పావతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పట్వారిగూడెం గ్రామానికి చేరుకున్న మంత్రి తుమ్మల, ఇటీవల మృతిచెందిన స్వర్గీయ చెలికాని రంగారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయ జీవిత ప్రారంభం నుంచి తనతో కలిసి నడిచిన రంగారావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిIMG-20260708-WA0011 వారి దుఃఖంలో తాను భాగస్వామినని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో దమ్మపేట, అశ్వరావుపేట మండలాల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు. ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.
ఎల్కతుర్తి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు): మండల పరిధిలోని ది విశాల సహకార బ్యాంకు నూతన పాలకవర్గంలో నామినేటెడ్ సొసైటీ డైరెక్టర్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో...
నారు సిద్ధం, నీటి కోసం నిరీక్షణ వర్షాభావంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం.
కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
కాంగ్రెస్ నాయకుల యోగక్షేమాలు తెలుసుకున్న ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని.
24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.
ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి: మిల్కూరి వాసుదేవరెడ్డి.