నరాల ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.

నరాల ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.

పెద్దమందడి,జూలై05( తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు నరాల నాగభూషణ్ - నాగన్న తల్లి నరాల ఎల్లమ్మ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెల్టూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎల్లమ్మ నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే నరాల నాగభూషణ్ - నాగన్న తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి,ఎల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కంటెస్టడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, బిజెపి మాజీ మండలాధ్యక్షుడు రమేష్, మద్దూర్ వెంకటయ్య, గుండెలో ఆంజనేయులు, ఇర్కిచెట్టి నారాయణ, మహేంద్ర, కర్నె నాగన్న, కుమ్మరి కొండన్న, కావాలి రాజు, బండి ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు, పాల్గొని ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారూ.

Tags:

Post Your Comments

Comments

Latest News

నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం. నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం.
హుజురాబాద్, జూలై 5 (తెలంగాణ ముచ్చట్లు):  నియోజకవర్గ కేంద్రంగా, వరంగల్–కరీంనగర్ ప్రధాన రహదారిపై కీలక పట్టణంగా ఉన్న హుజురాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు గత కొన్ని...
కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం.
నరాల ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.
తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి.
హైవే దిగి తప్పించుకోవాలనుకున్నారు... సత్తుపల్లిలో చిక్కారు..