తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి.
వనమహోత్సవంలో చైర్మన్ సందేశం.

జమ్మికుంట టౌన్ జులై 05 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ తమ నివాసాల వద్ద తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
"తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి" అని పేర్కొంటూ, పెరుగుతున్న జనాభాతో ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే విస్తృతంగా మొక్కలు నాటడం అవసరమని అన్నారు. ఖాళీ ప్రదేశాలతో పాటు ప్రతి ఇంటి పరిసరాల్లోనూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, చందా రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, బొళ్ల సదానందం, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సీఎల్ఆర్పీలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.


Comments