తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి.

వనమహోత్సవంలో చైర్మన్ సందేశం.

తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి.

IMG-20260705-WA0012

జమ్మికుంట టౌన్ జులై 05 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ తమ నివాసాల వద్ద తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
"తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి" అని పేర్కొంటూ, పెరుగుతున్న జనాభాతో ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే విస్తృతంగా మొక్కలు నాటడం అవసరమని అన్నారు. ఖాళీ ప్రదేశాలతో పాటు ప్రతి ఇంటి పరిసరాల్లోనూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, చందా రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్, బొళ్ల సదానందం, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సీఎల్‌ఆర్‌పీలు, ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం. నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం.
హుజురాబాద్, జూలై 5 (తెలంగాణ ముచ్చట్లు):  నియోజకవర్గ కేంద్రంగా, వరంగల్–కరీంనగర్ ప్రధాన రహదారిపై కీలక పట్టణంగా ఉన్న హుజురాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు గత కొన్ని...
కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం.
నరాల ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.
తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి.
హైవే దిగి తప్పించుకోవాలనుకున్నారు... సత్తుపల్లిలో చిక్కారు..