ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.
కొమ్ము చెన్నకేశవులు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు .
వనపర్తి,జులై 05 (తెలంగాణ ముచ్చట్లు):
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వనపర్తి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ పిలుపునిచ్చారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న గో టు విలేజెస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వనపర్తి పట్టణంలోని కర్రెమ్మ గుడి వద్ద మాదిగ కుల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణానికి స్థల సేకరణపై చర్చించారు.ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ మాట్లాడుతూ, మాదిగల వర్గీకరణ అవసరాన్ని వివరించారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలపాటు సాగిన ఉద్యమ ఫలితంగానే వర్గీకరణ చట్టం సాధ్యమైందని పేర్కొన్నారు.వర్గీకరణ ద్వారా లభించే అవకాశాలను మాదిగ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రాణించాలని సూచించారు.జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని, నూతన జెండా గద్దెలను నిర్మించి ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య మాదిగ నిర్వహించారు.కార్యక్రమంలో వీఎచ్పీఎస్ నాయకులు గంధం లక్ష్మయ్య, సుబ్రహ్మణ్యం, గంధం ఎల్లయ్య మాదిగ, ఆకులోర అంజి మాదిగ, ద్వారపోగు మద్దిలేటి మాదిగ తదితరులు పాల్గొన్నారు.


Comments