సకాల వర్షాలకై వెల్టూరులో ఘట్టాభిషేకం.
పెద్దమందడి,జూన్29(తెలంగాణ ముచ్చట్లు):
జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఘట్టాభిషేకం (గంగాభిషేకం)ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రధాన పూజారి శివకుమార్ ఆధ్వర్యంలో పవిత్ర జలాలతో స్వామివారికి ఘట్టాభిషేకం నిర్వహించి, అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. గ్రామ శ్రేయస్సు, సకాల వర్షాలు, పంటల సమృద్ధి కోసం ఈ ప్రత్యేక ఘట్టాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆలయ పూజారి శివకుమార్ తెలిపారు.


Comments