మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ .

మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ .

పూర్తిగా దూరంగా ఉండాలి – సమాచారం అందించిన వారి వివరాలు గోప్యమే

హుజూరాబాద్, జూన్ 25(తెలంగాణ ముచ్చట్లు ):

సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకమని హుజూరాబాద్ ఏసీపీ పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను నాశనం చేయడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నిర్మూలనలో పోలీసు శాఖతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఏ ప్రాంతంలోనైనా మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు. 
మత్తు పదార్థాల నియంత్రణలో పోలీసుల చర్యలతో పాటు ప్రజల అప్రమత్తత కూడా ఎంతో అవసరమని ఏసీపీ తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు కలిసి మత్తు వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని కుటుంబ సభ్యులు, సమాజం, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ . మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ .
పూర్తిగా దూరంగా ఉండాలి – సమాచారం అందించిన వారి వివరాలు గోప్యమే హుజూరాబాద్, జూన్ 25(తెలంగాణ ముచ్చట్లు ): సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలంటే ప్రజల...
హుజురాబాద్‌లో పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.
జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
సొంత గ్రామంలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి.
పశువుల ఆరోగ్యమే రైతు ఆర్థిక బలం.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.
జమ్ములమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి.