జర్నలిస్ట్ జానీపాషా జన్మదినం సేవామయం.
-- ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ
-- టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుని పిలుపుతో ముందుకొచ్చిన జర్నలిస్టులు
ఖమ్మం బ్యూరో , జూన్ 22 (తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్ట్, షేక్ జానీ పాషా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ పిలుపు మేరకు జర్నలిస్టులు, సంఘ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... జన్మదిన వేడుకలను కేవలం కేక్ కటింగ్కే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్,
అక్రిడీటేషన్ కమిటీ సభ్యురాలు మధుశ్రీ, ప్రముఖ యాంకర్ సిరి, యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి గరిడేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు సయ్యద్ అంజద్, కొరకొప్పుల రాంబాబు, ఇతర జర్నలిస్టు మిత్రులు పాల్గొని జానీ పాషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments